Thursday, March 28, 2024

న్యూస్ చానెల్ ఉద్యోగిని ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో ఓ న్యూస్ చానెల్ లో పనిచేస్తున్న యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సిద్దిపేటకు చెందిన పి.రాములు కుమార్తె కల్యాణి(26) హైదరాబాద్ లోని ఓ న్యూస్ చానెల్ లో విధులు నిర్వహిస్తూ, గత రెండేళ్లుగా అదే చానెల్ లో పనిచేస్తున్న శివ అనే యువకుడితో ప్రేమలో ఉంది. ఇటీవల తనను వివాహం చేసుకోవాలని కల్యాణి, శివను కోరగా.. అతను నిరాకరించాడు. దీంతో తాను బతకడం వృథా అని భావించిన ఆమె, ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని బలవర్మరణానికి. తన సోదరుడితో కలిసి ఉంటున్న ఆమె.. సోదరుడు విధులు ముగించుకుని వచ్చేసరికి కల్యాణి మృతదేహం ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు, మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరిలించి, పోస్ట్ మార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. తన కుమార్తె మృతికి శివనే కారణమని కళ్యాణి తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు.

Girl Suicide due to love failure in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News