Tuesday, April 16, 2024

మినుములు సాగు చేయండి: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Glazes should be cultivated

 

హైదరాబాద్: యాసంగిలో మినుములు సాగు చేయాలని రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.  ఈ యాసంగిలో మినుములు విరివిగా సాగు చేయండని పిలుపునిచ్చారు. పూర్తి స్థాయిలో మార్క్ ఫెడ్ ద్వారా మినుముల కొనుగోలుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. రైతులు వెంటనే మినుములను విత్తుకోవాలని సూచించారు. మినుముల కనీస మద్ధతు ధర క్వింటాలుకు రూ.6300లు ఉండగా, మార్కెట్ ధర కనీస మద్ధతు ధర కన్నా ఎక్కువ ఉన్నా కూడా అదే ధరకు కొనడానికి ప్రభుత్వం సిధ్దంగా ఉందని సింగిరెడ్డి స్పష్టం చేశారు.

అవసరమైనన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దేశ వ్యాప్తంగా మినములు, మినపపప్పు కొరత తీవ్రంగా ఉందని,  ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వ నాఫెడ్ సంస్థను సంప్రదించింది. రాష్ట్రానికి మినుముల కొనుగోలుకు సంబంధించి నాఫెడ్ సంస్థ లిఖితపూర్వక హామీ ఇచ్చింది.  మినుములతో పాటు మార్కెట్ లో డిమాండ్ ఉన్న పెసర్లు, వేరుశెనగ, ఆవాలు, నువ్వులు, పొద్దు తిరుగుడు వంటి పంటలు సాగు చేయాలన్నారు.  మార్క్ ఫెడ్ కేంద్ర కార్యాలయంలో పాలకవర్గ సభ్యుల సమావేశంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, మార్క్ ఫెడ్ ఛైర్మన్ మార గంగారెడ్డి, మార్క్ ఫెడ్ ఎండి పి.యాది రెడ్డిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News