Thursday, April 25, 2024

కోట్ల ఆస్తి…. చివరి కోరిక తీరలేదు…

- Advertisement -
- Advertisement -

వరంగల్ రూరల్: కరోనాతో వారం రోజులు పోరాడి బంగారం వ్యాపారి (48) మృతి చెందిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా రేగొండ మండలం దమ్మన్నపేటలో జరిగింది. సదరు వ్యాపారి కరోనా సోకడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న సమయంలో తాను చనిపోతే దమ్మన్నపేటలో ఉన్న ఎర్రచందనం వనంలో అంత్యక్రియలు జరపాలని సూచించాడు. మృతదేహంతో కుటుంబ సభ్యులు దమ్మన్నపేటకు చేరుకోగానే గ్రామస్థులు సరిహద్దులోనే అడ్డుకున్నారు. అంత్య క్రియలు గ్రామంలో నిర్వహించొద్దని, గుంత తవ్వకానికి జెసిబి డ్రైవర్లు కూడా సహకరించలేదు. మృతదేహాన్ని శివారు చలివాడు ఒడ్డున శ్మశాన వాటికలో దహనం చేశారు. మృతుడికి పట్టణంలో మూడు చోట్ల కోటి రూపాయల విలువైన భవనం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News