- Advertisement -
ముంబై: దేశంలో బంగారం ధరలు సరికొత్త శిఖరాలకు చేరుతున్నాయి. తాజాగా 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 59,130కి చేరింది. రెండు రోజుల వ్యవధిలోనే బంగారం ధర రూ.1000లు అధికమైంది. వారం రోజుల్లో పసిడి ధర నాలుగు సార్లు పెరిగింది. గరిష్టంగా బంగారం ధర రూ.65వేలకు పెరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లో తులం బంగారం ధర రూ.59,130గా ఉంది. న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముకు 54,750 రూపాయలకు, చెన్నైలో 54,200 రూపాయలకు పెరిగింది. ముంబైలో 54,500 రూపాయలు. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.59,130. అంతర్జాతీయ మార్కెట్లో, బంగారం శుక్రవారం 2 శాతానికి పైగా పడిపోయింది.
- Advertisement -