- Advertisement -
ముంబై: భారత్ లో పసిడి ధరలు క్రమక్రమంగా దిగివస్తున్నాయి. గురువారం కూడా పసిడి ధర కాస్త తగ్గింది. పుత్తడికి మనదేశంలో భారీడిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. కాగా, అధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో ఇండియా కూడా ఒకటి. ఆగస్టు నెలలో భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. గత వారంలో ఏకంగా 10 గ్రాముల బంగారం ధర రూ. వెయ్యి రూపాయలకు పైగా దిగింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఈరోజు రూ. 440 తగ్గి రూ.52,410కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 తగ్గి రూ. 48,050గా నమోదైంది. కిలో వెండి ధర రూ. 1800 తగ్గి రూ. 60,200కు చేరుకుంది.
Gold prices today fall for third day
- Advertisement -