- Advertisement -
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం కస్టమ్స్ అధికారులు అక్రమంగా బంగారం తరలిస్తుండగా పట్టుకున్నారు. దుబాయి నుంచి ఎఫ్జెడ్ 439 విమానం ద్వారా హైదరాబాద్కు వచ్చిన ఓ వ్యక్తి నుంచి 244.150 గ్రాముల బంగారాన్ని బ్యాగులో దాచి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ రూ.12.04లక్షల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
- Advertisement -