Wednesday, April 24, 2024

‘శంషాబాద్’లో బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

Gold seized in Shamshabad airport

మనతెలంగాణ/హైదరాబాద్(శంషాబాద్) : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రమంలో మరోసారి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన మహిళా ప్రయాణికురాలి దగ్గర నుంచి 268.400 గ్రాముల బంగారం సీజ్ చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.13 లక్షలు 73 వేలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు.మహిళ బంగారాన్ని పేస్టు రూపంలో టేపులో ఉంచి తన వీపునకు అతికించుకుందని అధికారులు పేర్కొన్నారు. మహిళపై అనుమానంతో తనిఖీలు చేయగా బంగారం బయటపడటంతో సదరు మహిళను అరెస్ట్ చేసిన కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News