Thursday, April 25, 2024

ఫీవర్ సర్వేతో మంచి ఫలితాలు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Good results with fever survey

ఖమ్మం: త్వరలో ఆదిలాబాద్‌లో కూడా క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో అధునాతన క్యాథ్ ల్యాబ్, ట్రామా కేర్, మిల్క్ బ్యాంక్ ను హరీష్ ప్రారంభించారు. గుండె సంబంధిత వ్యాధులకు వైద్యులను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. తెలంగాణలో రెండో మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేశామని, మధిర, సత్తుపల్లిలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని వివరించారు. వచ్చే ఏడాది ఖమ్మం ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఖమ్మం మార్చురీని కూడా అధునీకరిస్తామని హామీ ఇచ్చారు. ఫీవర్ సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. 77 లక్షల ఇండ్లలో ఫీవర్ సర్వే జరిపి మెడికల్ కిట్లను అందజేశామని హరీష్ రావు తెలియజేశారు.

ఇప్పటికే చాలా జిల్లాల్లో ఫీవర్ సర్వే పూర్తైందని, థర్డ్‌వేవ్‌లో ఫీవర్ సర్వేతో మంచి ఫలితాలు వచ్చాయని కితాబిచ్చారు. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇప్పటికే కోటి హోం ఐసోలేషన్ కిట్లు సిద్ధంగా ఉంచామన్నారు. థర్డ్ వేవ్‌లో 86 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని, వంద శాతం వ్యాక్సినేషన్‌లో ఖమ్మం రెండో స్థానంలో ఉందని, తెలంగాణలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. 60 ఏళ్ల వారితో పాటు ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు బూస్టర్ డోసు వేస్తామన్నారు. హైదరాబాద్ తరహాలో ఖమ్మంలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపి నామా నాగశ్వరరావు, ఎమ్మేల్సీ తాత మధుసూదన్, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్, టిఎస్ఎంఎస్ఐడిసి ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News