Thursday, March 28, 2024

చత్తీస్‌గఢ్‌లో పట్టాలు తప్పిన గూడ్స్‌రైలు

- Advertisement -
- Advertisement -
Goods train derails in Chhattisgarh
ప్యాసింజర్ రైళ్ల నిలిపివేత

బిలాస్‌పూర్: 8 వ్యాగన్ల గూడ్స్‌రైలు చత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున(2.54 గంటలకు) పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో ప్యాసింజర్ రైళ్లకు అంతరాయం ఏర్పడింది. అంబికాపూర్‌అనుప్పూర్ మార్గంలోని కమాల్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్‌కు సమీపంలో ఈ స్టేషన్ ఉంది. గూడ్స్‌రైలు అంబికాపూర్‌లో సరుకులను దించివేసిన తర్వాత బిలాస్‌పూర్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో పట్టాలు తప్పింది. అది సింగిల్‌లైన్ రూట్ కావడంతో ప్రయాణికుల రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన కారణంగా దుర్గ్‌అంబికాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలును బిష్రాంపూర్ రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. అంబికాపూర్ నుంచి జబల్‌పూర్‌కు ఉదయం 6.15కు బయలుదేరాల్సిన మరో రైలు షెడ్యూల్‌ను మార్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News