Thursday, April 25, 2024

ముచ్చటగా మూడోసారి…

- Advertisement -
- Advertisement -

హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌లది టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్లను అందించారు. ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఈ ఇద్దరూ కలిసి ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ కెరీర్‌లో 30వ సినిమాగా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌ను శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు షాట్‌కు వివి వినాయక్ క్లాప్ కొట్టగా.. టీజీ వెంకటేష్ కెమెరా స్విచాన్ చేశారు. మొదటి సన్నివేశానికి దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు గౌరవప్రదంగా దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీవాస్ మాట్లాడుతూ.. “ఈ సినిమాకు కూడా మంచి కథ కుదిరింది. భూపతి రాజా అందించిన కథ మీద చాలా వర్క్ చేశాం. కెమెరామెన్ వెట్రితో లౌక్యం సినిమాను చేశాను. మిక్కీ జె. మేయర్ సంగీతం బాగుంటుంది. పండుగ తరువాత మా సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తాము”అని అన్నారు.

నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల మాట్లాడుతూ..“సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ హ్యాట్రిక్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీ సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాము”అని తెలిపారు. గోపీచంద్ మాట్లాడుతూ.. “2007లో ‘లక్ష్యం’, ఆ తరువాత ఏడేళ్లకు ‘లౌక్యం’… మళ్లీ ఏడేళ్లకు ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాం. భూపతి రాజా మంచి కథను అందించారు. వెట్రితో వరుసగా సినిమాలు చేస్తున్నాను. దాదాపు ఐదు చిత్రాలు ఆయనతో చేశాను” అని అన్నారు. ఈ కార్యక్రమంలో రైటర్ భూపతి రాజా, కెమెరామెన్ వెట్రి తదితరులు పాల్గొన్నారు. ఇక వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగ తరువాత ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి డైలాగ్స్: వెలిగొండ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె.

Gopichand and Sriwass new movie Launched

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News