Thursday, April 18, 2024

కేంద్రం పగ.. జీతాలకు సెగ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభు త్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాలు ఆలస్యం కాకుండా త్వరలోనే చర్యలు చేపడతామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు పేర్కొన్నా రు. కేంద్రం నిధులు ఆపడం వల్లే రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులుకు జీతాల చెల్లింపులో ఆల స్యం అవుతుందని, అయినా సకాలంలో జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒక టో తేదీన జీతాలు వస్తుండే.. ఇప్పుడేమో పదో తా రీఖుకు జీతాలు వస్తున్నాయని ఉపాధ్యాయులు అ నుకుంటున్నారని, జీతాల గురించి మీకు కూడా ఆందోళన ఉందని అన్నారు. అయితే డబ్బులు ఉం డి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకుండ ఉంటామా..? కావాలని ఆపుతామా..? అని పేర్కొన్నారు. మొదటి ఆరేడు ఏళ్లు ఎప్పుడు కూడా జీతాలు ఆగలేదని, ఏడాది కాలం నుంచి ఈ సమ స్య వస్తుందని చెప్పారు.

వనస్థలిపురంలోని ఎం.ఇ. రెడ్డి గార్డెన్స్‌లో శనివారం రాష్ట్రోపాధ్యాయ సం ఘం వజ్రోత్సవ వేడుకల ఘ నంగా జరిగాయి. ఎస్‌టియుటిఎస్ అధ్యక్షుడు జి.సదానందం గౌడ్ అధ్యక్షత జరిగిన ఈ వజ్రోత్సవ వేడుకలకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంఎల్‌ఎ సు ధీర్‌రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, ఎస్‌టియుటిఎస్ టీచర్ ఎంఎల్‌సి అభ్యర్థి భుజంగరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్ధికంగా ఇబ్బంది పెడుతోందని, అం దువల్లనే జీతాలు ఆలస్యమవుతున్నాయని తెలిపా రు. అసెంబ్లీలో తాను ప్రవేశపెట్టిన రెండున్నర ల క్షల కోట్లకు బడ్జెట్ పాస్ అయిందని, బడ్జెట్ పా సైన తర్వాత ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం రూ. 15 వేల కోట్లు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News