సిఎం కెసిఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు
కోవిడ్ నిబంధలను పాటిస్తూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని పిలుపు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కెసిఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు ప్రవచించిన ప్రే మ, కరుణ, శాంతి అనే సుగుణాలను పాటిస్తే అందరి జీవితాలు సుఖశాంతులతో నిండుతాయని ముఖ్యమంత్రి అన్నారు. యేసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయన్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రజలు సంతోషంగా క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు.
బాలయ్య మృతిపై కెసిఆర్ సంతాపం
అంతర్జాతీయ స్థాయిలో పేరుగడించిన బాతి క్ చిత్ర కళాకారుడు యాసల బాలయ్య మృతి పై సిఎం కెసిఆర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాలయ్య మరణం చిత్రకళారంగానికి తీరని లోటని సిఎం అన్నారు. బాతిక్ చిత్ర కళ ద్వారా బాలయ్య పల్లె జీవన సౌందర్యాన్ని కళ్ళకు కట్టారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Governor CM KCR wished the people Christmas