- Advertisement -
లఖ్నో : మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్(85) వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. మూత్ర విసర్జనలో, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో ఈ నెల 11న లఖ్నోలోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం టాండన్ ఆరోగ్య పరిస్థితి విషమించినా, నిలకడగా ఉన్నదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఉత్తర్ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ఆస్పత్రిని సందర్శించి టాండన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కడుపులో రక్తస్రావం కావడంతో సోమవారం టాండన్కు అత్యవసర శస్త్ర చికిత్స నిర్వహించారు.
- Advertisement -