Tuesday, April 23, 2024

గవర్నర్ తమిళిసైకి గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ పురస్కారం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్‌ను అంతర్జాతీయ పురస్కారం వరించింది. తమిళిసై సౌందర రాజన్‌కి గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్స్‌లెన్స్2021 అవార్డు వచ్చినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. యుఎస్ కాంగ్రెస్ మ్యాన్ డానికే డేవిస్ మల్టీ ఎథ్నిక్ అడ్వయిజరీ టాస్క్‌ఫోర్స్ వారిచే ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ఎంపికయ్యారు. ఈ అవార్డు కోసం ప్రపంచవ్యాప్తంగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో పాటు మరో 18 మంది మహిళలు ఎంపికయ్యారు. సమాజ హితం కోసం సేవలు అందించినందుకు గాను ఈ పురస్కారాన్ని అందించనున్నారు. ఈ అవార్డును 9వ వార్షిక కాంగ్రషనల్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గాలా వేడుకల సందర్భంగా ఈ నెల 7వ తేదీన అమెరికా నుండి వర్చువల్ పద్ధతిలో ప్రదానం చేస్తారు.

Governor Tamilisai gets Global Women of Excellence Award

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News