Thursday, April 25, 2024

రాజ్‌భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో భారత గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసౌ సౌందరాజన్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుమందు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపి అజనీ కుమార్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News