- Advertisement -
హైదరాబాద్ : రాజ్భవన్లో ఐటి నిపుణులు, ఎగ్జిక్యూటివ్లతో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు. కరోనా నేపథ్యంలో గవర్నర్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఐటి నిపుణులు, ఎగ్జిక్యూ టివ్ల నుంచి సలహాలను ఆమె స్వీకరించారు. అంతకుముందు రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రాజ్భవన్లో ఏర్పాటు చేసిన ఆహారం పంపిణీ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు, పనిచేసే మహిళలకు, వలస కూలీలకు గవర్నర్ ఆహార పొట్లాలను అందజేశారు.
Governor Tamilisai Video Conference with IT Experts
- Advertisement -