Wednesday, April 24, 2024

రేపు మహేశ్వరానికి గవర్నర్ తమిళిసై

- Advertisement -
- Advertisement -

Governor Tamilisai Visits Maheshwaram tomorrow

మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో సోమవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటించనున్నారు. మహేశ్వరంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం శివగంగ రాజరాజేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం కొత్వాల్‌ చెరువుతాండలో గిరిజన మహిళలతో కలిసి రెండవ డోస్‌ కోవిడ్-19 టీకా తీసుకోనున్నారు. మొదటిటీకా పుదుచ్చేరి రాష్ట్రంలో తీసుకోగా రెండవ డోస్ కొత్వాల్‌ చెరువుతాండ గిరిజనులతో తీసుకుంటుండడం విశేషం. గవర్నర్ రాక సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్ తహశీల్దార్ ఆర్‌పి. జ్యోతి వైద్య ఆరోగ్యశాఖ పోలీసు అధికారులు స్ధానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. కరోనా టీకాపై గిరిజనుల్లో ఉన్న అపోహలను తొలగించడానికి గవర్నర్ సంకల్పించినట్లు అధికారులు తెలిపారు. వందశాతం వాక్సినేష్‌లో భాగంగా మారుమూల ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని గవర్నర్ ఆదేశించినట్లు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News