Thursday, April 25, 2024

లాక్‌డౌన్ వదంతులే

- Advertisement -
- Advertisement -

అసత్య ప్రచారాన్ని నమ్మోద్దు, ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు
స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తిరిగి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. ఇది పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. తాను ఎలాంటి ఉత్తుర్వులు కూడా జారీ చేయలేదని సిఎస్ పేర్కొన్నారు. గురువారం రాత్రి రాష్ట్రంలో సాయంత్రం ఆరు నుంచి తెల్లవారు ఎనిమిది గంటల వరకు లాక్‌డౌన్ విధించినట్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఈ సందర్భంగా ఆయన ఖండించారు. దీనిని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోందన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Govt not considering Lockdown in Telangana: CS 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News