Friday, April 19, 2024

ఉరేసుకున్న గురుకుల టీచర్?

- Advertisement -
- Advertisement -

Woman Suicide in Nalgonda

భద్రాద్రికొత్తగూడెం: గురుకుల టీచర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లెలో జరిగింది. గురుకుల పాఠశాలలో ఎస్ కళ్యాణి(26) అనే టీచర్ ఉరేసుకుంది. వెంటనే ఆమెతో పని చేసే టీచర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె స్వస్థలం ఇల్లందు మండలంలోని రొంపెడు అని తెలిపారు. ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి లేఖలు లేవని పోలీసులు పేర్కొన్నారు. శవ పరీక్ష అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కళ్యాణి గురుకులంలో సైన్స్ టీచర్ గా పనిచేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News