Thursday, April 25, 2024

రోడ్డు ప్రమాదంలో తాత మనవరాలు మృతి

- Advertisement -
- Advertisement -

Grandfather and granddaughter killed in road accident

సిద్దిపేట: రోడ్డు ప్రమాదంలో తాత, మనవరాలు మృతిచెందిన విషాదసంఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ చౌరస్తాలో సోమవారం జరిగింది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన నర్సారెడ్డి అహ్మదీపూర్ లో ఉంటున్న తన కుమారై ఇంటికి ఆదివారం వెళ్లాడు. రాత్రి అక్కడే ఉండి ఉదయం తన మనవరాలిని వెంట తీసుకుని లక్ష్మీదేవిపల్లికి బయలుదేరాడు. గ్రామం నుంచి కొద్ది దూరం వెళ్లగానే అతివేగంగా వచ్చిన బొలెరో వాహనం బైకును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నర్సారెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రగాయాలైన అనన్య గద్వాల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనన్య మృతిచెందింది. తాత మనవరాలు మృతి కుటుంబీకులు సోకసంద్రంలో మునిగిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Grandfather and granddaughter killed in road accident

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News