Friday, April 26, 2024

ఇడి విచారణకు గ్రానైట్ వ్యాపారులు

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్: ఫెమా నిబంధనల ఉల్లంఘనల కేసులో పలువురు గ్రానైట్ వ్యాపారులు సోమవారం విచారణకు హాజరయ్యారు. ఇటీవలనే పలు గ్రానైట్ కంపెనీల్లో ఇడి అధికారు లు సోదాలు నిర్వహించారు. విచారణకు రావాల ని ఇడి అధికారులు గ్రానైట్ వ్యాపారులను కోరా రు. దీంతో పలువురు గ్రానైట్ వ్యాపారులు ఇడి అ ధికారుల ఎదుట సోమవారం విచారణకు హాజరయ్యారు. రూ.124 కోట్ల విలువైన పన్నును ఎగ్గొట్టారని గ్రానైట్ కంపెనీలపై ఆరోపణలున్నాయి. సీనరేజీని ఎగ్గొట్టేందుకు గ్రానైట్‌ను తక్కువగా చూ పారని గ్రానైట్ వ్యాపారులపై ఆరోపణలున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విషయమై గ్రానైట్ కంపెనీలపై ఆరోపణలున్నాయి. 2013 లో అప్పటి ప్రభుత్వానికి విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక సమర్పించింది. ఇటీవల 8 గ్రానైట్ కంపెనీల్లో ఇడి సోదాలు నిర్వహించిం ది. సోదాల ఆధారంగా గ్రానైట్ వ్యాపారులను ప్రశ్నిస్తున్నారు. గ్రానైట్ కాంట్రాక్టర్లంతా కరీం నగర్‌కు చెందినవారని సమాచారం.

ఇటీవల మంత్రి గంగుల కమలాకర్, ఎంపి వద్దిరాజు రవిచంద్రకు సంబంధించిన సంబంధించిన కంపెనీలతో పాటు హైదరాబాద్, కరీంనగర్‌లోని ఈ సంస్థల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఇందులో పలు సంస్థలు చైనా, హాంకాంగ్‌తో పాటు ఇతర దేశాల్లోని కంపెనీలకు లెక్కల్లో చూపించిన దానికన్నా ఎక్కువ పరిమాణంలో ముడి గ్రానైట్ ఎగుమతి చేసినట్లు పూర్తి ఆధారాలతో ఇడి నిర్ధారించింది. లెక్కల్లోకి రాని మొత్తం ఆ దేశాల నుంచి హవాలా మార్గంలో తరలించినట్లు గుర్తించింది. ఇక చైనాకు చెందిన లీవెన్ హ్యూ అనే వ్యాపారి ఖాతా నుంచి గ్రానైట్ సంస్థల యజమానుల ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో నగదు జమైనట్లు కూడా అధికారులు గుర్తించారు. అంతర్జా తీయంగా పన్ను ఎగవేతదారుల వివరాలతో పనామా లీక్స్ విడుదల చేసిన జాబితాలో లీవెన్ హ్యూ పేరు ఉండటం విశేషం.

గతంలో సిబిఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఫెమా నిబంధనల ఉల్లంఘన, మనీలాండరింగ్ కేసులో ఇడి సోదాలు నిర్వహించిందని అంతా అనుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఇచ్చిన నివేదిక ఆధారంగానే గ్రానైట్ సంస్థల్లో సోదాలు నిర్వహిం చామని తమ ప్రకటనలో ఇడి అధికారులు వెల్లడించడం గమనార్హం. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29.05.2013లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అప్రైజల్ నివేదిక నంబరు 6 (సి.నెం.268/ఎన్‌ఆర్/2013) ప్రకారం 7,68.889.937 క్యూబిక్ మీటర్ల ఖనిజాన్ని విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేసినట్లు ప్రకటనలో ఇడి వెల్లడించింది. విజిలెన్స్ నివేదిక ప్రకారం ఎగవేసిన సీనరేజ్ ఫీజు రూ.124,94,46,147, ఎగవేసిన పెనాల్టీ రూ.624,72,30,735 రెండు కలిపి మొత్తం రూ.729,66,76.882గా తేల్చింది. అప్పటి విజిలెన్స్ ఆధారంగా కేసు నమోదు చేసిన ఇడి దర్యాప్తు కొనసాగుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News