Thursday, March 28, 2024

రాష్ట్రంలో గ్రీన్ మిషన్ కొనసాగుతోంది: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Green Mission continues in Telangana state Says KTR

పచ్చనితోరణంగా మారిన 19 ఇంటర్ ఛేంజ్‌లు
ట్విట్టర్ వేదికగా పచ్చదనంతో పరుచుకున్న ఓఆర్‌ఆర్
వీడియోను షేర్ చేసిన మంత్రి కెటిఆర్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన నుంచి పుట్టిన హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో గ్రీన్ మిషన్ కొనసాగుతోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా హెచ్‌ఎండిఏ పరిధిలోని 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్డు, ఓఆర్‌ఆర్ అనుసంధానంగా ఉన్న 19 ఇంటర్ ఛేంజ్‌లు పచ్చనితోరణంగా మారిన దృశ్యాలను కనువిందుగా చూపిస్తూ మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా వీడియోను షేర్ చేశారు. ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా, మధ్యలో నాటిన మొక్కలు చిగురులు తొడిగి పచ్చగా కనువిందు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఓఆర్‌ఆర్‌తో అనుసంధానంగా ఉన్న కూడళ్లలో వివిధ ఆకారాల్లో నాటిన మొక్కలు ఆకర్షిస్తున్నాయని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News