Thursday, March 28, 2024

హరితహారంతో ఆకుపచ్చ తెలంగాణ: మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

Green telangana with Haritha haram

మేడ్చల్: పల్లె ప్రగతితో గ్రామాల రూపు రేఖలు మారిపోయాయని మంత్రి మల్లారెడ్డి ప్రశంసించారు. కీసరలో మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎంపి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. హరితహారంతో తెలంగాణ ఆకుపచ్చగా మారిందన్నారు. కరోనా ఆపత్కాలంలో ఆక్సిజన్ కొనుక్కునే దుస్థితి రాకుండా సిఎం కెసిఆర్ ముందుచూపుతో హరితహారం చేపట్టారని కొనియాడారు. కీసర రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంతాన్ని ఎంపి సంతోష్ కుమార్ టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దుతున్నారని మెచ్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News