Saturday, April 20, 2024

తెల్లారితే పెళ్లి.. వరుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

groom commits Suicide in Ranga Reddy

తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదక్ పల్లిలో గురువారం విషాదం చోటుచేసుకుంది. తెల్లారితే వివాహం అనగా.. పెళ్లి కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరేసుకుని శ్రీకాంత్ (24) బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగానే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మరణానికి ప్రేమవ్యవహారమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

groom commits Suicide in Ranga Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News