Saturday, April 20, 2024

నవ వధువు గొంతు కోసి…. వరుడు ఆత్మహత్యాయత్నం….

- Advertisement -
- Advertisement -

 

మేడ్చల్ మల్కాజ్‌గిరి: వివాహం జరిగిన 28 రోజులకే నవ వధువు హత్య చేసి అనంతరం వరుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కామారెడ్డికి చెందిన సుధారాణి(22), కిరణ్ కుమార్ (25) ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇరువైపులా తల్లిదండ్రులను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. నిజాంపేట ప్రాంతం ప్రగతి నగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. శనివారం తన కుమార్తెను చూడటానికి కామారెడ్డి నుంచి నిజాంపేటకు ఆమె తల్లిదండ్రులు వచ్చారు. అపార్ట్‌మెంట్‌కు వచ్చిన తరువాత ఎంతకు డోర్ తీయకపోవడంతో స్థానికుల సహాయంతో డోర్‌ను ఓపెన్ చేసి చూడగా కూతురు బెడ్‌రూమ్‌లో రక్తపు మడుగులో కనిపించింది. అల్లుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండడంతో పోలీసులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. వివాహం జరిగి నెల గడవక ముందే కూతుర్ని అల్లుడు చంపేయడంతో అతడి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న ఆమె బంధువులను అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె గొంతు కోసి చంపిన అనంతరం అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఆమెపై అనుమానం ఉండడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. పెళ్లికి నాలుగు నెలల ముందు తన కుమారుడి రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయాలైనట్టు అతడి తల్లిదండ్రులు తెలిపారు. అప్పటి నుంచి అతడి మానసిక స్థితి సరిగా లేదని కిరణ్ తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News