Friday, April 26, 2024

గ్రూప్ 3.. వచ్చే నెల 23 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 1,363 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా, దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. వచ్చే నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హులైన అభ్యర్థులు టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌లో తమ వన్ టైం పాస్‌వర్డ్(ఒటిఆర్) నెంబర్‌తో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి. ఇప్పటివరకు తమ ఒటిఆర్‌ను సవరించుకోని అభ్యర్థులు, ముందుగా ఒటిఆర్‌లో సవరణలు చేసుకుని గ్రూప్ 3కు దరఖాస్తు చేసుకోవాలని టిఎస్‌పిఎస్‌సి సూచించింది. మొదటిసారి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఒటిఆర్ నమోదు చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News