Friday, April 19, 2024

గచ్చిబౌలిలో నూతన కార్యాలయం ప్రారంభించిన జీస్క్వేర్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: దక్షిణ భారతదేశంలో అతి పెద్ద ప్లాట్‌ ప్రమోటర్‌ జీస్క్వేర్‌ హౌసింగ్‌ లిమిటెడ్‌ తమ నూతన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. గచ్చిబౌలి వద్ద నున్న ఈ నూతన కార్యాలయంలో 200 మందికి పైగా ఉద్యోగులు పనిచేసేందుకు తగిన వసతులు ఉన్నాయి. ఇప్పటి వరకూ 75 మంది ఉద్యోగులు ఇక్కడ సంస్ధకు ఉన్నారు. రాబోయే నెలల్లో మరింత మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకోనున్నారు.

తెలంగాణాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను జీస్క్వేర్‌ చేపట్టింది. హైదరాబాద్‌లో సంస్ధ రాబోతున్న ప్రాజెక్టులలో ఒకటి అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నాగార్జునసాగర్‌ రోడ్‌లోని బీఎన్‌ రెడ్డి నగర్‌ వద్ద ఉంది. అలాగే త్వరలో ప్రారంభంకానున్న మైక్రోసాఫ్ట్‌ డాటా సెంటర్‌కు సమీపంలో షాద్‌ నగర్‌ వద్ద కూడా ఓ ప్రాజెక్ట్‌ ఉంది.

ఈ నూతన కార్యాలయం తెరువడం గురించి జీస్క్వేర్‌ హౌసింగ్‌ సీఈఓ శ్రీ ఈశ్వర్‌ ఎన్‌ మాట్లాడుతూ.. ‘‘దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లలో తెలంగాణా ఒకటి. భారీ టెక్నాలజీ సంస్ధలన్నీ కూడా తమ క్యాంపస్‌లను ఇక్కడ ఏర్పాటుచేయడం వల్ల ఇక్కడ అద్భుతమైన వృద్ధికి అవకాశాలున్నాయి. దక్షిణ భారతదేశంలో పలు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను మేము అభివృద్ధి చేశాము. తెలంగాణా మార్కెట్‌లో సైతం ప్రవేశించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. నేడు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి వద్ద మా నూతన కార్యాలయం తెరిచాము. ఈ నెలాఖరు నాటికి 200 మంది ఉద్యోగుల సంస్థగా నగరంలో నిలువనున్నాము’’ అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News