Tuesday, April 23, 2024

పోలీస్ స్టేషన్ లో వ్యక్తి ఆత్మహత్య… ఎస్ఐ సస్పెండ్

- Advertisement -
- Advertisement -

Gujarath Man dies by suicide in police station

అహ్మదాబాద్: పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఆరోపణలు రావడంతో ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసిన సంఘటన గుజరాత్ లోని గంజమ్ జిల్లా గోలంతర పోలీస్ స్టేషన్ లో పరిధిలో జరిగింది. రంగిపూర్ గ్రామంలో గణేష్ వ్యక్తి చుట్టుపక్కల వాళ్లతో గొడవ పడుతుండడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. గణేష్ ని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. పిఎస్ లోని ఓ గదిలో అతడు బెల్ట్ తో ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే బాధితుడిని ఎంకెసిజి మెడికల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించిన అనంతరం కుటుంబానికి శవాన్ని అప్పగించారు. ఈ ఘటనపై డిఐజి సత్యభ్రాత్ బాయ్ స్పందించారు. ఎస్ఐ పిసి ఆచార్యతో పాటు ఒక కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామన్నారు. విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News