వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లను టిఆర్ఎస్ అధిష్టానం శుక్రవారం ఖరారు చేసింది. మేయర్గా గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్గా రిజ్వానా షమీమ్ పేర్లను ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరిస్తున్న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి సంయుక్తంగా ప్రకటించారు. గుండు సుధారాణి 29వ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా విజయం సాధించారు. రిజ్వానా షమీమ్ 36వ డివిజన్ నుంచి గెలిచారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లు ఉన్నాయి. ఇందులో టీఆర్ఎస్ 48 డివిజన్లు గెలుచుకోగా, బిజెపి 10, కాంగ్రెస్ 4, ఇతరులు 4 స్థానాలను దక్కించుకున్నారు.