- Advertisement -
బాలీవుడ్ యంగ్ బ్యూటీ, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్న ‘గుంజన్ సక్సేనా:ది కార్గిల్ గర్ల్’ మూవీ ట్రైలర్ విడుదలైంది. 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ధీర వనిత, ఎయిర్ ఫోర్స్ తొలి మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ టైటిల్ పాత్రలో నటిస్తోంది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం కారోనా కారణంగా వాయిదా పడింది. లాక్ డౌన్ నేపథ్యంలో పలు చిత్రాలు ఓటిటి ప్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ చిత్రం కూడా అదే బాటలో విడుదల కానుంది. అగస్టు 12న ‘గుంజన్ సక్సేనా‘ చిత్రాన్ని నెట్ ఫ్లిక్ లో విడుదల చేయనున్నారు.
GUNJAN SAXENA movie trailer released
- Advertisement -