Thursday, April 25, 2024

ఉపఎన్నికలో ఈటల ఓడిపోవడం ఖాయం: గుత్తా సుఖేంద‌ర్

- Advertisement -
- Advertisement -

Gutta sukender reddy fires on Etala Rajender

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ తనని తాను రాజకీయంగా నాశనం చేసుకున్నారని శాస‌న‌మండ‌లి మాజీ చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ఆరోపించారు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప.. హత్యలుండవని ఆయన తెలిపారు. ఈటలకు సిఎం కెసిఆర్ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. దేశవ్యాప్తంగా మోడీ గ్రాఫ్ పడిపోయిందని విమర్శించారు. ఆస్తుల రక్షణ కోసమే ఈటల బిజెపిలో వెళ్తున్నారని గుత్తా పేర్కొన్నారు. ఉపఎన్నికలో ఈటల ఓడిపోవడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. మరో 20 ఏళ్లు టిఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంటుందన్న గుత్తా 2026 ఎన్నికల్లో రిజర్వేషన్ల మారుతాయని చెప్పారు. నియోజకవర్గాల డి-లిమిటేషన్ 2026లో పూర్తవుతుందని గుత్తాసుఖేంద‌ర్ రెడ్డి తెలిపారు.

Gutta sukender reddy fires on Etala Rajender

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News