Thursday, April 25, 2024

రేవంత్… దమ్ముంటే హుజూరాబాద్ కు రా: గువ్వల

- Advertisement -
- Advertisement -

Guvvala Balaraju slams Revanth Reddy

హైదరాబాద్: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి దమ్ముంటే హుజూరాబాద్‌ కు రావాలని టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ గువ్వల బాలరాజు సవాలు విసిరారు. రేవంత్‌కు దళితుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో రేవంత్ విర్రవీగుతున్నాడని మండిపడ్డారు. సిఎం కెసిఆర్‌పై ప్రతిపక్షాలు మాట్లాడుతున్న తీరు జుగుప్సాకరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ నిర్వహించిన సభలో దళితులు, ఆదివాసులు, గిరిజనులు ఎంత మంది ఉన్నారని ప్రశ్నించారు. తొట్టి గ్యాంగ్ పెట్టుకొని తిరుగుతూ నోటికి వచ్చినట్టు మాట్లాడితే సహించమని గువ్వల హెచ్చరించారు. గజ్వేల్‌లో రేవంత్ సభ పెడితే ఎవరు రారు అని, పట్టించుకునే నాథుడే లేడని ఎద్దేవా చేశారు. దళిత బంధు పథకం విషయంలో దేశమంతా చర్చ జరుగుతోందని ప్రశంసించారు. టిపిసిసి ప్రెసిడెంట్ గా ప్రమాణం చేయనున్న సందర్భంగా రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రాలకు వెళ్లి రమ్మంటే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులు రాలేదని ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News