Thursday, April 25, 2024

మరో 20ఏళ్లు టిఆరెస్సే అధికారంలో ఉంటుంది: గువ్వల బాలరాజు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 20ఏళ్లు టిఆరెస్సే అధికారంలో ఉంటుందని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. గురువారం టీఆర్ఎస్ ఎల్ఫీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. నిన్న రావిరాలలో జరిగిన దళిత, గినజన దండోరా సభలో కాంగ్రెస్ టిపిిసిసి అధ్యకుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రింటింగ్ ప్రెస్-గోడల మీద రాతలు రాసే రేవంత్ రెడ్డి వేల కోట్లకు ఎలా ఎదిగారు? అని ప్రశ్నించారు. ఔట్ డేటెడ్ నేతలు, బజనాపరులు మాత్రమే రేవంత్ వెంట ఉన్నారన్నారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలను కాంగ్రేస్ అడ్డుకునే కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాంగ్రేస్ నేతలు రైతుబంధు ఎందుకు వదులుకోవడం లేదు? ప్రశ్నించారు. దళితబంధుపై ప్రభుత్వ వాదనతో కోర్టు ఏకీభవించిందన్నారు. పథకాలు అమలు కోసం కోర్టుకు పోతారు కానీ.. పథకాలు ఆపడానికి పోతారా? అని మండపడ్డారు. ఇంద్రవెళ్లి సభ ముగిసిన వెంటనే కాంగ్రేస్ పార్టీని వీడి 500మంది టీఆరెస్ కండువా కప్పున్నారు. రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోకపోతే గజ్వేల్ సభను అడ్డుకుంటామని హెచ్చరించారు.

Guvvala Balaraju slams Revanth Reddy

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News