- Advertisement -
పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్: స్నేహితులతో కలిసి పబ్బుకు వెళ్లిన యువతిని పోకిరీలు వేధింపులకు గురిచేసిన సంఘటన నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. నగరానికి చేసిందిన యువతి తన స్నేహితులతో కలిసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోగ్ పబ్కు వెళ్లింది. అక్కడ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తుండగా కొంతమంది పోకిరీలు వేధింపులకు గురిచేశారు. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
- Advertisement -