Saturday, April 20, 2024

శ్రీలంకతో టీ20లకు రోహిత్, కోహ్లీ దూరం..

- Advertisement -
- Advertisement -

టి20 కెప్టెన్‌గా హార్దిక్
వన్డే సారథిగా రోహిత్ శర్మ
శ్రీలంక సిరీస్‌కు భారత జట్ల ఎంపిక
ముంబై: సొంత గడ్డపై శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్లను మంగళవారం ఎంపిక చేశారు. భారత్‌లో పర్యటించే శ్రీలంక మూడు టి20లు, మరో 3 వన్డేలు ఆడనుంది. దీని కోసం వేర్వేరు జట్లను బిసిసిఐ ఎంపిక చేసింది. టి20 టీమ్‌కు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. సూర్యకుమార్ యాదవ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. సీనియర్లు విరాట్ కోహ్లి, రాహుల్, రోహిత్ తదితరులు సిరీస్‌కు దూరంగా ఉన్నారు.

హార్దిక్‌తో పాటు ఇషాన్ కిషన్, రుతురాజ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠ, వాషింగ్టన్, సంజు శాంసన్, చాహల్, అక్షర్, అర్ష్‌దీప్, హర్షల్ తదితరులకు చోటు దక్కింది. కాగా, వన్డే జట్టుకు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. సీనియర్లు కోహ్లి, రాహుల్‌లు సిరీస్‌లో పాల్గొంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News