పవన్ కళ్యాణ్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ ఫిల్మ్ ‘హరహర వీరమల్లు’. ఈ చిత్రం షూటింగ్ త్వరలో పునప్రారంభం కానుంది. దీనికి సంబంధించి కథానాయకుడు పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపారు చిత్ర సమర్పకులు ఎ.ఎం.రత్నం, డైరెక్టర్ క్రిష్. ‘భీమ్లా నాయక్’ చిత్రం షూటింగ్ పూర్తవగానే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించటానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా చిత్రీకరించ వలసిన సన్నివేశాలు, గీతాలు, పోరాట సన్నివేశాలు, షూటింగ్ ప్రదేశాలు, నిర్మించ వలసిన భారీ సెట్స్ వంటి విషయాల గురించి చిత్ర నిర్మాత, దర్శకుడి మధ్య సమాలోచనలు జరిగాయి. ఇప్పటివరకు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ దాదాపు యాభై శాతం పూర్తయింది.
మిగిలిన భాగాన్ని నిరవధికంగా షూటింగ్ జరిపి పూర్తిచేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాత ఎ.దయాకర్ రావు తెలియచేశారు. ఈ చిత్రాన్ని 2022 ఏప్రిల్ 29న విడుదల చేయనున్నారు. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు క్రిష్. పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళంలో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటించే ఈ చిత్రాన్ని మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్పై ఏ.ఎం.రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మిస్తున్నారు.