Thursday, March 28, 2024

ఈటెల తప్పుకోవడానికి రెడీనా… నేను రాజీనామాకు రెడీ: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

 గ్యాస్ సిలిండర్ ధరలో 291 రూపాయలు రాష్ట్ర పన్ను ఉందని రుజువు చేస్తే నా పదవికి రాజీనామా: హరీష్ రావు

291 రూపాయలు ట్యాక్స్ ఉన్నదని రుజువు చేయకపోతే ఎన్నికల నుండి తప్పుకుంటావా… రాజేందర్

రేపు రావాలా?…. ఇవాళ రావాలా?…

జమ్మికుంటకా?…… హుజూరాబాద్ కా?….

ఈటెలకు సవాల విసిరిన హరీశ్ రావు.

Harish rao challenge to Etela rajender

 

కరీంనగర్: రెండు సంవత్సరాల్లో హుజూరాబాద్ లో ఇళ్లుకట్టించి చూపిస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.  మంత్రిగా ఉండి ఈటల చేయలేదని, ఇక ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తారని నిలదీశారు. పెంచికల్ పేట సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.  300 రూపాయలు టిఆర్ ఎస్ ప్రచారానికి రాకుండా ఈటెల వర్గీయులు ప్రయత్నించారని, ఇదెక్కడి సంస్కృతి అని మండిపడ్డారు. ప్రజలకు సేవ చేస్తా, గెలిపిస్తే ఇది చేస్తా, అది చేస్తా అని చెప్పాలి కానీ ఇలా చేయడం ఏంటి అని ఈటెలపై హరీష్ వ్యంగ్యస్త్రాలు సంధించారు.

పేద ప్రజల మీద ప్రేమ ఉండి ఉంటే సిఎం కెసిఆర్ ఇచ్చిన నాలుగు వేల ఇళ్లు కట్టి ఉంటే బాగుండేదన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు పేదలు కనిపించ లేదా అని,  రూ 300 ఇవ్వడం కాదు, తాళ్లతో కట్టినా ఆ బంధనాలు తెంపుకుని వచ్చి టిఆర్ఎస్ కు ఓటు వేస్తారన్నారు. ఈటల రాజేందర్ చేరింది బిజెపి పార్టీ అని గ్యాస్ సిలండర్ వేయి రూపాయలు చేసింది ఆపార్టీనే అని మండిపడ్డారు. సిలిండర్ ధర పెంచినా మీకు తిప్పలయినా నాకు ఓటు వేయండని ఈటెల అంటున్నారని ఎద్దేవా చేశారు. గ్యాస్ బండ ధరలో 291 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఉందని చెబుతున్నారని, ట్యాక్స్ వేసి ఉంటే ఎక్కడకు రావాలి? అని సవాలు విసిరారు.  ఒక వేళ 291 రూపాయలు గ్యాస్ సిలిండర్ పై పన్ను వేసి ఉంటే ఇవాళ రమ్మంటావా… రేపు రమ్మంటావా?… జమ్మికుంటు గాంధీ బొమ్మకాడకు రమ్మంటవా?…హుజూరాబాద్ అంబేద్కర్ బొమ్మ కాడకు రమ్మంటవా? అని సవాలు విసిరారు.

రాష్ట్ర ప్రభుత్వం 291 రూపాయలు పన్ను వేసి ఉంటే తాను అక్కడ్నే రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నారు. ఈటెల ఎన్నిక నుండి తప్పుకుంటవా? అని అడిగారు.  పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధర, మంచి నూనే పెంచింది నీ ప్రభుత్వం కారణం కాదా?, ఇళ్లు కట్టకండా ధరలు పెంచే పార్టీలో చేరి ఓట్లు వేయమంటావా?, నిన్నటిదాకా నువు చేసిందేంటి…రేపు నువ్వు చేసేదేంటి అని అడిగారు.  సిఎం కెసిఆర్ రెండేళ్ల పాటు ఉండేది టిఆర్ఎస్ పార్టీ అని, అభివృద్ది జరగాలని, మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని అబద్దాలతో, గోబెల్స్ ప్రచారంతో ఓట్లు పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30వ తేదీన ఓటు వేసేముందు వంట రూంలోకి వెళ్లి గ్యాస్ బండకు దండం పెట్టండని, కసి కసిగా కారు గుర్తుకు ఓటు వేయండని హుజూరాబాద్ ఓటర్లకు పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News