Thursday, April 25, 2024

వలస కూలీలను ఆదుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

 

సంగారెడ్డి: రాష్ట్రంలో 3.50 లక్షల మంది వలస కూలీలకు బియ్యం, రూ.500 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో వలస కూలీలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ.500 నగదును స్వయంగా మంత్రి హరీష్ రావు అందజేశారు. రాష్ట్రంలో వలసకూలీలు ఒక్కరు కూడా ఆకలితో బాధపడుకూదని సిఎం కెసిఆర్ చెప్పారని, వలస కూలీలు భయాందోళన చెందొద్దని, మిమ్మల్నీ మా బిడ్డలుగానే చూసుకుంటామని హరీష్ రావు వారికి భరోసా ఇచ్చారు. అలాగే, ఢిల్లీ జమాతే సమావేశానికి వెళ్లి వచ్చినవారిని జిల్లాలో 38 మందిని గుర్తించామని.. వీరిలో కొంతమందిని గాంధీ ఆస్పత్రికి, మరికొందరిని సంగారెడ్డి ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ప్రజలు అనవరంగా రోడ్లపైకి రావొద్దని మంత్రి కోరారు.

Harish Rao gives 12 kgs Rice, Rs.500 to Migrant workers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News