- Advertisement -
సంగారెడ్డి: జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంఎల్ఎ మాణిక్ రావు, ఎంపి బిబిపాటిల్ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సంగారెడ్డి, జహీరాబాద్ లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నామని, కరోనా లక్షణాలు ఉంటే అధికారులకు సమాచారం అందించాలని చెప్పారు. వలస కూలీలు ఎలాంటి ఆందోళన చెందొద్దని.. వారికి భోజన వసతి ఏర్పాటు చేస్తామని తెలిపారు. శనగ రైతుల కోసం ఐదు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
Harish Rao review meeting on Corona in Sangareddy
- Advertisement -