Friday, July 18, 2025

సర్కార్ నిర్లక్షంతో ప్రాజెక్టులు పడావు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభు త్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని మాజీ మం త్రి,బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు ఎక్స్ వేదికగా విమర్శించారు. ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్మాణ ప నులు ముందుకు పోక, ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ లేక, కొత్త ప్రాజెక్టుల ఆలోచన రాక తెలంగాణ సాగు నీటి రంగం సంక్షోభంలోకి వెళ్తున్నదని పే ర్కొన్నారు.తెలంగాణ నీటి రంగానికి అత్యంత ప్రా ధాన్యం ఇచ్చి, సాగును బాగు చేసిన ఘనత కెసిఆర్‌ది అయితే, ప్రాజెక్టులను పడావు పెట్టి, నిర్వహణ గాలికి వదిలి ఎపికి నీళ్లు వదులుతున్న ఘ నత రేవంత్ రెడ్డిది అని ఆరోపించారు. ఏడాదిన్నర పాలనలో జరిగిన ప్రాజెక్టుల ప్రమాదాలు, కాంగ్రె స్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనాలు అంటూ పలు ఘటనలు ఉదహరించారు. ఖమ్మంలో పెద్దవాగు కొట్టుకుపోయింది, నల్లగొండలో సుంకిశా ల కుప్ప కూలింది, పాలమూరులో వట్టెం పంప్ హౌజ్ జలమయమైంది, ఎస్‌ఎల్‌బిసి కుప్ప కూలిం ది,

జోగులాంబ గద్వాల్‌లో జూరాల ప్రాజెక్టు గేట్ల రోప్స్ తెగిపోయాయి, సంగారెడ్డిలో మంజీర డ్యాం ఆప్రాన్ వరద  దాటికి కొట్టుకుపోగా, పియ్యర్స్‌లలో పగుళ్లు వచ్చాయని తెలిపారు. పాలన వైఫల్యం, కాంగ్రెస్ చేతగాని తనం వల్లే ఇన్ని ప్రమాదాలు జరిగాయని, ఇవేవి ఎన్‌డిఎస్‌ఎకు కనిపించవు, వినిపించవు అని మండిపడ్డారు. మేడిగడ్డ కుంగిన వెంటనే ఎన్‌డిఎస్‌ఎకు లేఖ రాసిన కిషన్ రెడ్డి, కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న ప్రాజెక్టుల ప్రమాదాలు ఎందుకు కనిపించడం లేదు..? అని ప్రశ్నించారు. మేడిగడ్డలో 85 పియ్యర్స్ ఉంటే అందులో ఒక పియ్యర్ కుంగిపోతే మొత్తం ప్రాజెక్టే కుప్ప కూలిందని ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి, ఏడాదిన్నరలో జరిగిన ఘటనలకు ఎవరు బాధ్యులు..? అని నిలదీశారు. కాళేశ్వరంపై ఏడుస్తూ కాలం వెల్లదీయడం తప్ప, ఏడాదిన్నరగా మీరు చేసిందేం ఉందని సిఎంను అడిగారు.

ఒక చెరువు తవ్వింది లేదు, ఒక్క చెక్ డ్యాం కట్టింది లేదు, ఒక్క ఎకరాలకు కొత్తగా నీరు ఇచ్చింది లేదు అని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే కొత్తగా ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందిస్తామని చెప్పి, ఆరు వేల ఎకరాలకు కూడా ఇవ్వలేదని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో సాధించిన తెలంగాణలో మల్లా నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం కొట్లాడాల్సిన పరిస్థితి రేవంత్‌రెడ్డి తెచ్చారని మండిపడ్డారు. నీళ్లు: బనకచర్ల ద్వారా ఏపీ తరలించే కుట్ర, నిధులు: ఏపీకి తరలివెళ్తున్న కేంద్ర నిధులు, నియామకాలు: నోటిఫికేషన్ల కోసం విద్యార్థులు రోడ్లెక్కే పరిస్థితి వచ్చిందంటూ విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్లు తెరిచి తెలంగాణకు ప్రాణాధారం అయిన సాగునీటి రంగాన్ని ఆయన రాజకీయ అజెండాలకు బలి చేయవద్దంటూ హితవు పలికారు. మేడిగడ్డపై దుష్ప్రచారం ఆపేసి, ఇకనైనా ప్రాజెక్టుల నిర్వహణపై దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణ ప్రజలు రేవంత్‌రెడ్డి రోత మాటలతో పాటు, ఆయన చేతగాని తనాన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News