Friday, April 19, 2024

కొండపోచమ్మ.. చల్లగా దీవించమ్మా: మంత్రి హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

Harish Rao visit Kondapochamma Temple

జగదేవ్ పూర్: పోచమ్మ తల్లీ రాష్ట్ర ప్రజలందరినీ చల్లగా సుభిక్షంగా ఉండేలా దీవించు తల్లీ అంటూ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అమ్మవారిని వేడుకున్నారు. గురువారం సిద్ధిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కొండ పోచమ్మ ఆలయంలో ఆలయ 20వ వార్షికోత్సవ వేడుకల్లో హాజరైన మంత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ సమీపంలో ఓ భక్తుడు వేయించిన సదరు పట్నంలో మంత్రి హాజరయ్యారు. మంత్రి వెంట ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Harish Rao visit Kondapochamma Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News