మన తెలంగాణ/హైదరాబాద్ : ఓ చదువుల తల్లిని మంత్రి హరీష్రావు మనస్ఫూర్తిగా అభినందించారు. సిద్ధిపేట అర్బన్ మండలం బక్రీ చెప్యాల గ్రామానికి చెందిన పురుమాండ్ల కొండల్రెడ్డిరేవతి దంపతుల పెద్ద కూతురు వెన్నెల రెడ్డి ములుగులోని ఫారెస్ట్ కాలేజీలో ఇటీవల బిఎస్సీ డిగ్రీ పూర్తి చేసింది. ఎమ్మెస్సి ఫారెస్ట్ ఉన్నత విద్య కోసం గత ఆగస్టు 27న జాతీయ ఎంట్రన్స్ పరీక్ష రాసింది. ఈ పరీక్షలో అత్యు త్తమ ప్రతిభ కనబర్చి దేశంలోనే 9వ ర్యాంకు సాధించింది. దేశంలోనే వెన్నెల టాప్10లో నిలవడం పట్ల హరీష్రావు ఆమెను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఎంతో మంది విద్యావంతులను తీర్చిదిద్దిన బెనారస్ యూనివర్సిటీలో సీటు దక్కించుకుంది. ఈ కోర్సులో ప్రవేశం పొందిన మొట్టమొదటి విద్యార్థినిగా సిద్ధిపేట జిలా ఖ్యాతిని వెన్నెల చాటింది. మంచి ర్యాంకు సాఢించిన వెన్నెలను ఫోన్లో మాట్లాడిన మంత్రి హరీష్రావు ప్రత్యేకంగా అభినందించారు. అరుదైన కోర్సులో చేర్పించి ప్రోత్సహించిన తల్లిదండ్రులు కొండల్రెడ్డి, రేవతి దంపతుల కు శుభాకాంక్షలు తెలిపారు. తమ ఊరి ఆడబిడ్డ సాధించిన విజయంపై బక్రీ చెప్యాల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.