Friday, March 29, 2024

హరితహారం గొప్ప కార్యక్రమం: గుత్తా

- Advertisement -
- Advertisement -

Harithaharam is good event at nalgonda

 

నల్లగొండ: హరితహారం గొప్ప కార్యక్రమమని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని అన్నేపర్తిలో హరితహారం కార్యక్రమంలో భాగంగా అద్దంకి-నార్కట్‌పల్లి జాతీయరహదారి పరిసరాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, జగదీశ్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడారు. మానవాళి మనుగడకు మొక్కల పెంపకం చాలా కీలకమన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల్లోనూ మొక్కల పెంపకానికి సిఎం కెసిఆర్ ప్రాధాన్యత ఇచ్చారని, హరితహారంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, జడ్‌పి చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎంఎల్‌ఎ కంచర్ల భూపాల్ రెడ్డి, కలెక్టర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News