Wednesday, April 24, 2024

బూస్టర్ల పంపిణీలో ధనిక దేశాల తొందరపాటు

- Advertisement -
- Advertisement -

WHO experts back booster dose for immunocompromised

ప్రపంచ ఆరోగ్యసంస్థ

వాషింగ్టన్ : ఒమిక్రాన్ భయంతో అనేక దేశాలు బూస్టర్ డోసు పంపిణీని మొదలు పెట్టడంపై ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. నిరుపేద దేశాలు కనీసం ఒక్కడోసు కూడా అందించలేక ఇబ్బంది పడుతుంటే సంపన్నదేశాలు మాత్రం మూడో డోసు అందించడానికి ఆరాటపడుతున్నాయని, ఇలా చేస్తే ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ అసమానతలు మరింత దిగజారి పోవడమే కాకుండా మహమ్మారిని మరింత కాలం పొడిగించినట్టు అవుతుందని హెచ్చరించింది. వ్యాక్సిన్ తీసుకోని వారి లోనే ఎక్కువ ఆస్పత్రిలో చేరికలు, మరణాలు చోటు చేసుకుంటున్నాయి. బూస్టర్ డోసు తీసుకోని వారిలో కాదు. ఇలా ఏకపక్షంగా వెళ్లి ఏ దేశం కూడా ఈ మహమ్మారిని జయించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసస్ హెచ్చరించారు.

వ్యాక్సిన్లు అందుబాటు లోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ఆఫ్రికాలో ప్రతి నలుగురు ఆరోగ్య సంరక్షణ సిబ్బందిలో ఒక్కరికి మాత్రమే వ్యాక్సిన్ అందిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా వ్యాక్సిన్ లభ్యతలో అసమానతల వల్ల ఎన్నో ప్రాణాలకు ముప్పు ఉందని, అయినప్పటికీ కొన్ని దేశాలు బూస్టర్ డోసుకు ఎందుకు పరుగెడుతున్నాయని ప్రశ్నించారు. ప్రపంచ వ్యాప్తంగా తయారౌతున్న కొవిడ్ వ్యాక్సిన్లలో 73 శాతం డోసులు కేవలం ధనిక, ఉన్నత మధ్య ఆదాయ దేశాలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అల్ప ఆదాయ దేశాల్లో 0.9 శాతం డోసులు మాత్రమే పంపిణీ చేసినట్టు అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి. ఇదే సమయంలో అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా, ఈయూ దేశాలు బూస్టర్ డోసును అందించడం పట్ల ప్రపంచ ఆరోగ్యసంస్థ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News