Thursday, March 28, 2024

మునుగోడు ఉపఎన్నికల ఓటర్ల జాబితాపై స్టే ఇవ్వ నిరాకరించిన కోర్టు

- Advertisement -
- Advertisement -

TS Govt to stopped Slot booking system

హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికల  ఓటర్ల జాబితా శుక్రవారం విడుదల చేయనున్న నేపథ్యంలో  ఓటర్ల జాబితా ప్రచురణపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు గురువారం నిరాకరించింది.  గత ఎన్నికలు జరిగిన 2019 నుంచి మునుగోడుకు సంబంధించిన ఓటర్ల జాబితా వివరాలను చూపుతూ తుది ప్రకటన చేయాలని భారత ఎన్నికల సంఘాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఆదేశించింది. మునుగోడులో గత రెండు నెలల్లో ఆగస్టు, సెప్టెంబర్‌లో నమోదైన తాజా ఓటర్ల వివరాలను ఉంచాలని ఈసిని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఆదేశించింది.

ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపు, సవరణలు కొనసాగుతున్న ప్రక్రియ అని, ఈ దశలో “అటువంటి ఉత్తర్వును మంజూరు చేయలేము” అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. కాగా కేసు విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News