Saturday, April 20, 2024

ప్రేమపెళ్లి… గర్భవతిని చేశాడు… పరారీలో ప్రియుడు

- Advertisement -
- Advertisement -

He escaped from his Lover

అమరావతి: రెండేళ్లుగా ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. గర్భవతిని చేశాడు… పెద్దల సమక్షంలో బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైనా పది రోజుల తరువాత భర్త కనిపించకపోవడంతో అత్తింటి ముందు భార్య ధర్నా చేస్తున్న సంఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… డైలీ మార్కెట్ ప్రాంతంలో నర్రు నందన తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. ఇంటి ఎదురుగా ఉండే నర్రు చినబాబుతో నందనకు పరిచయమైంది. ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని మాయ మాటాలతో ఆమెను లోబర్చుకున్నాడు. దీంతో గర్భవతి కావడంతో పెళ్లి చేసుకొని మాటమార్చాడు. వెంటనే పెద్దల సమక్షంలో ఆమెను బాబు పెళ్లి చేసుకున్నాడు. బాబు తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వకపోవడంతో నందన తన అన్నయ్య వాళ్ల ఇంట్లో ఉంటున్నారు. జూన్ 30న బయటకు వెళ్లిన బాబు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అత్తింటి ముందు తనకు భర్త కావాలని ఆమె ధర్నా చేస్తోంది. అత్తమామలు తన భర్తను దాచి పెట్టారని ఆమె ఆరోపణలు చేస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయింది. ఈ నేపథ్యంలో ఎస్‌ఐ సన్యాసి నాయుడు మీడియాతో మాట్లాడారు. మిస్సింగ్ కేసు నమోదు చేశామని చినబాబు కోసం వెతుకుతున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News