కూకట్ పల్లి: ప్రియురాలు సహజీవనం చేయడం లేదని ఆమెను ప్రియుడు సజీవదహనం చేసిన సంఘటన మేడ్చల్ జిల్లా కూకట్పల్లి పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వెంకట్లక్ష్మి అనే వికలాంగురాలు తన భర్త చనిపోవడంతో నాచారంలోని ఇఎస్ఐ ఆస్పత్రిలో స్వీపర్గా పని చేస్తోంది. తన కుమారుడితో కలిసి కూకట్పల్లిలోని ప్రశాంత్నగర్లో ఉంటుంది. వెంకటేష్ కు తన భార్య చనిపోవడంతో తన కుమారుడితో కూకట్పల్లిలో వెల్డింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వెంకట్ లక్ష్మి, వెంకటేష్ మధ్య పరిచయం ఉండడంతో పది సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి అతడిని దూరం పెట్టింది. దీంతో ఇద్దరు మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. దీంతో ఆమెపై అతడు పగ పెంచుకున్నాడు. బుధవారం ఆమె కుమారుడు ఆఫీస్కు వెళ్లినప్పుడు వెంకటలక్ష్మి ఒంటరిగా ఉన్నప్పడు ఇంట్లోకి వెంకటేష్ చొరబడ్డాడు. దీంతో ఇద్దరు మధ్య కాసేపు పెనుగులాట జరిగింది. కిరోసిన్ తీసి ఆమెపై పోసి నిప్పంటించాడు. ఆమె ఘటనా స్థలంలోనే చనిపోగా అతడు కూడా మంటలకు చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అంబులెన్స్లో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ సురేష్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాడు.