Friday, April 19, 2024

కూకట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం.. హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

- Advertisement -
- Advertisement -

Head Constable died in road accident at Kukatpally

హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్‌ మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. కెపిహెచ్‌బి బ్రిడ్జిపై మంగళవారం అర్ధరాత్రి ఓ కారు టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిని వ్యక్తిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ బుదవారం తెల్లవారుజామున మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తిని శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ ఈశ్వరయ్యగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Head Constable died in road accident at Kukatpally

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News