- Advertisement -
హైదరాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా వెల్స్ ఫర్గో (Wells Fargo) కంపెనీ సెంటర్ హెడ్ శ్రీధర్ చుండురి బుధవారం మొక్కలు నాటారు. సైబరాబాద్ సిపి సజ్జనార్ ఇచ్చిన ఛాలెంజ్ను శ్రీధర్ స్వీకరించి రాయదుర్గంలోని తమ కార్యాలయం ఆవరణలో 100 మంది సిబ్బందితో 200 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ఈ ఛాలెంజ్లోకి తనను ఆహ్వానించిన పోలీస్ కమిషనర్ సజ్జనార్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వెంకట్ రాఘవన్ (ఫ్యాక్ట్ షీట్, హెడ్), మురళీ (హెడ్ జెన్క్యూ), ఏవి రంగనాథ్ (ఐపిఎస్), శ్రీని పిక్చల (సెంటర్ హెడ్ డిఎక్స్సి), ప్రకాష్ బొథ్ల (సెంటర్ హెడ్ యూటిసి) తదితరులకు శ్రీధర్ ఈ సందర్భంగా గ్రీన్ఛాలెంజ్ విసిరారు.
Head of Wells Fargo Center where plants were planted
- Advertisement -