Saturday, April 20, 2024

5 నుంచి రాజన్నసిరిసిల్ల, ములుగు జిల్లాలో హెల్త్‌ప్రొఫైల్

- Advertisement -
- Advertisement -

Health profile in Rajannasirisilla Mulugu district from Mar 5

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల 5వ తేదీ నుంచి రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించనున్న హెల్త్ ప్రొఫైల్ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ రెండు జిల్లాల్లో ఈ ప్రయోగాత్మక హెల్త్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, రాష్ట్రంలోని మిగిలిన 31 జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ నమోదు ప్రాజెక్ట్‌ను అమలు చేయనుంది. వాస్తవానికి తెలంగాణలోని ప్రతి పౌరుడి ఆరోగ్య ప్రొఫైల్‌ను నమోదు చేయాలని గత ఏడాదిలో తీసుకున్నారు. అయితే, రాష్ట్రంలో ఓమిక్రాన్,డెల్టా వేరియంట్ కొవిడ్ -19 వ్యాధి ముప్పు కారణంగా ప్రాజెక్ట్ నిలిచిపోయింది. ఆ తరువాత ఫిబ్రవరి ప్రారంభంలో హెల్త్ ప్రొఫైల్స్ నమోదు ప్రారంభించాలని ప్రభుత్వం మరోసారి నిర్ణయించగా, ములుగు జిల్లాలో ఆసియా అతిపెద్ద గిరిజన సమ్మక్క సారక్క జాతర కారణంగా సంబంధించిన కార్యక్రమాలు అధికారులు నిలిపివేశారు.

ప్రస్తుతం కొవిడ్ -19 కేసులు తగ్గుతున్నందున, తెలంగాణ ప్రజల ఆరోగ్య ప్రొఫైల్‌ను మార్చి 5 నుండి ప్రారంభించాలని ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు. హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్ట్ కింద శనివారం నుంచి రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ప్రతీ ఇంటికి తిరిగి పౌరుల ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తారు. జ్వరం, రక్తపోటు, షుగర్ తదితర పరీక్షలన్నింటినీ ఇంటి వద్ద, ఇసిజి వంటి పరీక్షలను ప్రాథమిక కేంద్రాల వద్ద నిర్వహిస్తారు. ప్రతి లబ్ధిదారుడికి ఒక యూనిక్ ఐడీని కేటాయిస్తారు. అందులో ప్రాతిపదికన ఆరోగ్య సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చుతారు. యూనిక్ ఐడీ అందుబాటులో ఉండడం వల్ల వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని ఎక్కడి నుంచైనా పొందడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎవరికైనా, ఏదైనా జబ్బు చేస్తే వైద్యులు ఆన్‌లైన్‌లోనే వారి ఆరోగ్య చరిత్రను చూడడానికి వీలుపడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News